బీజేపీకి కార్మికుల ఉసురు తగులుతుంది: పొన్నం
ABN , First Publish Date - 2020-06-01T09:46:42+05:30 IST
బీజేపీకి వలస కార్మికుల ఉసురు తగులుతుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, మే 31(ఆంధ్రజ్యోతి): బీజేపీకి వలస కార్మికుల ఉసురు తగులుతుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ పాలనలో సాధించామంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేప్పే ట్రిపుల్ తలాక్, 370 రద్దు, అయోధ్యలో రామ మందిరం అంశాలు ప్రజలమధ్య చిచ్చుపెట్టేవే అని విమర్శించారు. కాగా, గిరిజన ప్రాంతా ల్లో జీవో నెం.3 చెల్లదన్న సుప్రీం ఆదేశాలపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ ప్రశ్నించారు.