తెలంగాణకు కేంద్రమంత్రులు ఏం చేశారో చెప్పాలి: పొన్నాల

ABN , First Publish Date - 2020-11-27T20:57:52+05:30 IST

తెలంగాణకు కేంద్రమంత్రులు ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గ్రేటర్ ఎన్నికల కోసం ఢిల్లీ నేతలు గుంపులు గుంపులుగా ప్ర,చారానికి వస్తున్నారని..

తెలంగాణకు కేంద్రమంత్రులు ఏం చేశారో చెప్పాలి: పొన్నాల

హైదరాబాద్: తెలంగాణకు కేంద్రమంత్రులు ఏం చేశారో చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గ్రేటర్ ఎన్నికల కోసం ఢిల్లీ నేతలు గుంపులు గుంపులుగా ప్రచారానికి వస్తున్నారని తెలంగాణ అభివృద్ధిని ఎందుకు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్‌ ఎప్పుడూ మతపరమైన వ్యాఖ్యలు చేయదని ఈసందర్భంగా ఆయన చెప్పారు. ప్రజలు వరదలతో ఇబ్బంది పడుతుంటే నాయకులకు పట్టడం లేదన్నారు.  ప్రజల రక్షణను గాలికొదిలేశారని ఆయన అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఏం , బీజేపీ మూడు పార్టీలు ఒక్కటేనని అన్నారు. ప్రజలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలకు గుణపాఠం చెబుతారన్నారు. కాంగ్రెస్ హయాంలోనే గ్రేటర్ అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. 


Updated Date - 2020-11-27T20:57:52+05:30 IST