శుక్రవారం ప్రధాని మోదీ వర్చువల్ ప్రసంగం
ABN , First Publish Date - 2020-09-04T03:18:05+05:30 IST
నేషనల్ పోలీస్ అకాడమీలో శుక్రవారం ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పెరేడ్ నిర్వహించారు. ప్రధాని మోదీ వర్చువల్గా..

హైదరాబాద్: నేషనల్ పోలీస్ అకాడమీలో శుక్రవారం ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పెరేడ్ నిర్వహించారు. ప్రధాని మోదీ వర్చువల్గా ప్రసంగించనున్నారు. ఏన్పీఏలో 131 మంది ఐపీఎస్లు శిక్షణ పొందారు. 71వ ఐపీఎస్ బ్యాచ్లో 28 మంది మహిళలు ఉన్నారు. తెలంగాణకు 11 మంది ఐపీఎస్లను కేటాయించారు. వీరిలోఇద్దరు మహిళలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్కు ఐదుగురు ఐపీఎస్లను కేటాయించారు.