రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ ముక్కలు
ABN , First Publish Date - 2020-12-13T07:43:40+05:30 IST
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లి రేషన్ షాపులో ప్రజలకు పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్ ముక్కలు వచ్చాయి. శనివారం మాధినేని రాజమ్మ

ఘటనపై విచారణ.. అప్పటిదాకా దుకాణం మూసివేత
హాజీపూర్, డిసెంబరు 12: మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లి రేషన్ షాపులో ప్రజలకు పంపిణీ చేసిన బియ్యంలో ప్లాస్టిక్ ముక్కలు వచ్చాయి. శనివారం మాధినేని రాజమ్మ, సిద్ధం రాములు, కడాల శంకరయ్య అనే లబ్ధిదారులు షాపు నుంచి బియ్యం తీసుకెళ్లారు. వండుకునే సమయంలో ప్లాస్టిక్ ముక్కలను గమనించారు.
విషయాన్ని సర్పంచ్ ఓలపు శారద, ఎంపీటీసీ డేగబాపుల దృష్టికి తీసుకెళ్లగా వారు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎన్ఫోర్స్మెంట్ డీటీ విజయ, తహసీల్దార్ మహ్మద్ జమీర్ బియ్యాన్ని, ప్లాస్టిక్ ముక్కలను పరిశీలించారు. విచారణ జరిపిస్తామని తెలిపారు. విచారణ పూర్తయ్యేంత వరకు తాత్కాలికంగా రేషన్ దుకాణాన్ని మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.