రేపట్నుంచి ప్లాస్మా థెరపీకి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు

ABN , First Publish Date - 2020-05-10T18:32:27+05:30 IST

తెలంగాణలో సోమవారం నుంచి ప్లాస్మా థెరపీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

రేపట్నుంచి ప్లాస్మా థెరపీకి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు

హైదరాబాద్ : తెలంగాణలో సోమవారం నుంచి ప్లాస్మా థెరపీకి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ప్లాస్మా దానం చేసేందుకు 15 మంది కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు ముందుకొచ్చారు. ఆ 15 మంది కూడా మొదట్లో కారోనా సోకిన విదేశాల నుంచి వచ్చిన వారు కావడం గమనార్హం. ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు గతంలోనే 200 మంది కోలుకున్న వ్యక్తులు గాంధీ వైద్యులకు తెలిపారు.


15 మందిలో ఒక్కొక్కరి నుంచి 400 ఎంఎల్‌ల రక్తం సేకరించనున్నట్లు నుంచి వైద్యులు తెలిపారు. ఒక్కోక్కరి రక్తం నుంచి ప్లాస్మా వేరు చేసేందుకు దాదాపు 2 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం ప్లాస్మా థెరపీ తీసుకునేందుకు గాంధీలో ఇవాళ్టికి 5మంది మాత్రమే అర్హులు. ప్లాస్మా సేకరించిన తరువాత గ్రహీత రక్తం మ్యాచ్ చేయడంతో ఓటు క్రాస్ మ్యాచ్ చేసిన తరువాతనే రోగికి వైద్యులు ప్లాస్మా ఇవ్వనున్నారు.

Updated Date - 2020-05-10T18:32:27+05:30 IST