పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలి
ABN , First Publish Date - 2020-06-18T10:10:08+05:30 IST
గత పది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని, వాటిని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ
ఆర్టీసీ క్రాస్రోడ్స్ వద్ద సీఐటీయూ ప్రదర్శన
రాంనగర్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి) : గత పది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయని, వాటిని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్రోడ్స్ వద్ద ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకున్నా ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలపై పెనుభారం పడుతుందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.ఈశ్వర్రావు, ఎం.వెంకటేష్ పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదల ప్రభావం రవాణా, సరుకుల రేట్లపై పడి నిత్యావసర సరుకుల ధరలు కూడా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. సీఐటీయూ నాయకులు జె.కుమారస్వామి, డి.ఎల్.మోహన్, కె.రమేష్, కె.అజయ్బాబు, ఎం.సత్యనారాయణ, ఆర్.మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.