నిధులున్నా.. బకాయిలు చెల్లించడం లేదు
ABN , First Publish Date - 2020-03-13T09:12:06+05:30 IST
తమను ఆదుకోవాలంటూ.. హెచ్ఎంటీ విశ్రాంత ఉద్యోగులు మానవహక్కుల కమిషన్ని ఆశ్రయించారు. తమకు రావలసిన గ్రాట్యుటీ, పీఎఫ్, ఇతర బకాయిలను హెచ్ఎంటీ దశాబ్దకాలంగా చెల్లించడం

హెచ్ఆర్సీలో ‘హెచ్ఎంటీ’ విశ్రాంత ఉద్యోగుల పిటిషన్
హైదరాబాద్, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): తమను ఆదుకోవాలంటూ.. హెచ్ఎంటీ విశ్రాంత ఉద్యోగులు మానవహక్కుల కమిషన్ని ఆశ్రయించారు. తమకు రావలసిన గ్రాట్యుటీ, పీఎఫ్, ఇతర బకాయిలను హెచ్ఎంటీ దశాబ్దకాలంగా చెల్లించడం లేదని హెచ్ఆర్సీలో గురువారం పిటిషన్ దాఖలు చేశారు. 1992 వేతన సవరణ బకాయిలు ఇప్పటివరకు ఇవ్వలేదని విన్నవించారు. హెచ్ఎంటీ సంస్థ వద్ద భారీగా నిధులున్నా.. విశ్రాంత ఉద్యోగులను చిన్నచూపు చూస్తోందని పేర్కొన్నారు.