విదేశీ జంతువులకు అనుమతి తప్పనిసరి

ABN , First Publish Date - 2020-11-27T08:00:54+05:30 IST

రాష్ట్రంలో విదేశీ జంతువులు, పక్షులను పెంచుకునే వారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని తెలంగాణ అటవీ శాఖ

విదేశీ జంతువులకు అనుమతి తప్పనిసరి

హైదరాబాద్‌, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విదేశీ జంతువులు, పక్షులను పెంచుకునే వారు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని తెలంగాణ అటవీ శాఖ పేర్కొంది. డిసెంబర్‌ 2లోగా కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ వెబ్‌సైట్‌లోని ‘పరీవే్‌ష’లో అనుమతుల కోసం నమోదు చేసుకోవాలని సూచించింది.

దరఖాస్తు సమయంలో ఎలాంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. క్షేత్రస్థాయి పరిశీలన సమయంలో మాత్రం సంబంధిత వివరాలను వెల్లడించాల్సి ఉంటుందని అటవీ సంరక్షణ ప్రధానాధికారి(పీసీసీఎఫ్‌) శోభ తెలిపారు.  


Updated Date - 2020-11-27T08:00:54+05:30 IST