వర్సిటీలకు వీసీలను నియమించాలి: పీడీఎ్సయూ
ABN , First Publish Date - 2020-07-27T09:15:22+05:30 IST
ప్రభుత్వ యూనివర్సిటీలకు వెంటనే వైస్ చాన్సలర్లను నియమించాలని పీడీఎ్సయూ రాష్ట్ర

హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ యూనివర్సిటీలకు వెంటనే వైస్ చాన్సలర్లను నియమించాలని పీడీఎ్సయూ రాష్ట్ర అధ్యక్షుడు మామిడికాయల పరుశురాం, ప్రధాన కార్యదర్శి ఇడంపాక విజయ ఖన్నా డిమాండ్ చేశారు. ఏడాది కాలంగా వర్సిటీల్లో వీసీ ఇన్చార్జిల పాలన కారణంగా బోధన, అభివృద్ధి నామమాత్రంగా మారిందన్నారు. వీసీ ఇన్చార్జిలుగా ఉన్న ఐఏఎస్ అధికారులు వర్సిటీల పరిపాలనపట్ల శ్రద్ధ చూపడం లేదని వారు ఆరోపించారు. అంతేగాక, 1,100 ప్రొఫెసర్ పోస్టులను ఆరేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఇప్పటికీ భర్తీ చేయలేదన్నారు.