లాక్ డౌన్లో కార్మికులకు వేతనాలు: కార్మిక శాఖ
ABN , First Publish Date - 2020-03-25T09:29:36+05:30 IST
లాక్డౌన్ కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు సంస్థలూ తమ కార్మికులు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర

హైదరాబాద్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): లాక్డౌన్ కాలంలో రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు సంస్థలూ తమ కార్మికులు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ కమిషనర్ అహ్మద్న దీమ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా పేరిట ఉద్యోగులు విఽఽధుల నుంచి తొలగించడం, వేతనాల్లో కోత విధించడం లాంటివి జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.