చేనేతకు చేయూత నివ్వండి

ABN , First Publish Date - 2020-11-25T22:02:03+05:30 IST

ప్రతీ వ్యక్తి కీ జన్మ దిన శుభాకాంక్షలను చెనేత తువ్వాళ్లు , వస్త్ర బహూకరణ తో తెలపాల్సిందిగా తెలంగాణా పద్మశాలి అఫిషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (టీ పోపా) రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ కోరారు.

చేనేతకు చేయూత నివ్వండి

మహబూబ్ నగర్: ప్రతీ వ్యక్తి కీ జన్మ దిన శుభాకాంక్షలను చెనేత తువ్వాళ్లు , వస్త్ర బహూకరణ తో తెలపాల్సిందిగా తెలంగాణా పద్మశాలి అఫిషియల్స్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (టీ పోపా) రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ కోరారు. అసోసియేషన్  పాలమూరు జిల్లా టీ పో పా అధ్యక్షులు భీంపళ్లి శ్రీకాంత్ జన్మదినం సందర్భంగా ఆయన ను కలిశారు. ఆత్మీయంగా అభినందించారు. ఈ సందర్భంగా "మాచన" మాట్లాడుతూ.. మంచితనం, మానవత్వం మృగ్యమైతున్న ప్రస్తుత తరుణంలో సాటి మనుషులను ఆత్మీయంగా పలకరించే వారే అరుదవు తున్నారని, అందుకే వ్యక్తులు ఏ స్థాయికి , ఎంత ఎత్తుకు ఎదిగినా వారికి పుట్టిన రోజు ఒక బెస్ట్ డే అని , ఆ రోజు వెల్లువెత్తే శుభాకాంక్షలు ఎంతో ఆత్మ సంతృప్తిని కలిగిస్తాయని అన్నారు.


తెలుగు సాహిత్య సుగంధాన్ని.. తేట తెలుగు పరిమళాన్ని తన మొగ్గ ల ప్రయోగంతో  గుబాళించెలా "భీంపల్లి" చేస్తున్న కృషీ అభినందనీయం అన్నారు . ఉపాధ్యాయుడిగా , కవిగా, రచయితగా రాణిస్తున్న సారస్వత పుత్రుడు శ్రీకాంత్ అని అభివర్ణించారు. తన నాలుగు పదుల వయస్సు లోనే  దాదాపు ఎనభై పుస్తకాలు వివిధ అంశాల పై రచన చేసిన ఘనత భీంపల్లి శ్రీకాంత్ దక్కించుకున్నారని ఇటువంటి వ్యక్తి పాలమూరు లో ఉండటం తెలంగాణ భాగ్యం అని మాచన రఘునందన్ కొనియాడారు.

Updated Date - 2020-11-25T22:02:03+05:30 IST