దేశంలో తెలంగాణను ప్రథమ స్థానంలో నిలపుతాం: కేసీఆర్
ABN , First Publish Date - 2020-03-13T16:52:29+05:30 IST
హైదరాబాద్: దేశంలో తెలంగాణను ప్రథమ స్థానంలో నిలుపుతామని.. అదే తమ లక్ష్యమని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

హైదరాబాద్: దేశంలో తెలంగాణను ప్రథమ స్థానంలో నిలుపుతామని.. అదే తమ లక్ష్యమని సీఎం కేసీఆర్ వెల్లడించారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల రూపురేఖలను మారుస్తున్నామన్నారు. గ్రామాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని వెల్లడించారు. నిధుల వినియోగంలో పారదర్శకతను పాటిస్తున్నామన్నారు. పరిపాలనలో జవాబుదారీతనం పెంచుతున్నామని కేసీఆర్ వెల్లడించారు.