సీబీఐ తర్వాతే.. ఈడీ కేసుల విచారణ చేపట్టాలి

ABN , First Publish Date - 2020-11-13T08:52:04+05:30 IST

ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన కేసుల విచారణ ముగిసిన తర్వాతే ఈడీ కేసులపై విచారణ చేపట్టాలంటూ నిందితుల

సీబీఐ తర్వాతే.. ఈడీ కేసుల  విచారణ చేపట్టాలి

కోర్టును కోరిన జగన్‌ న్యాయవాదులు

హైదరాబాద్‌, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ దాఖలు చేసిన కేసుల విచారణ ముగిసిన తర్వాతే ఈడీ కేసులపై విచారణ చేపట్టాలంటూ నిందితుల తరఫున న్యాయవాదులు సీబీఐ ప్రత్యేక కోర్టులో గురువారం వాదనలు వినిపించారు.

జగతి పబ్లికేషన్స్‌ పెట్టుబడుల వ్యవహరంపై సీబీఐ కేసు ఆధారంగానే ఈడీ కేసులు నమోదు చేసిన నేపథ్యంలో.. మొదట సీబీఐ కేసుల విచారణ మాత్రమే జరపాలని కోర్టుకు వారు నివేదించారు. కాగా, ఈడీ కేసుల విచారణ నవంబరు 17కి, సీబీఐ కేసుల విచారణను 16కి కోర్టు వాయిదా వేసింది.


Updated Date - 2020-11-13T08:52:04+05:30 IST