గురుకుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు

ABN , First Publish Date - 2020-04-25T08:39:03+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సాంఘిక, సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థుల కోసం టీశాట్‌ ‘‘నిపుణ’’ చానల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో పాఠాలు ..

గురుకుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాంఘిక, సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థుల కోసం టీశాట్‌ ‘‘నిపుణ’’ చానల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో పాఠాలు బోధింపజేస్తున్నామని గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సూచనతో 6వ నుంచి పదో తరగతి విద్యార్థుల కోసం ఈనెల 24 నుంచి మే 30 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ పాఠాలకు సంబంధించిన సందేహాలను 9133256222 నంబరుకు వాట్సాప్‌ లేదా ఎస్‌ఎంఎస్‌ ద్వారా పంపితే సమాధానం పొందవచ్చన్నారు.

Updated Date - 2020-04-25T08:39:03+05:30 IST