‘వన్ నేషన్- వన్ రేషన్’కు రాష్ట్రానికి రూ.2,508 కోట్లు
ABN , First Publish Date - 2020-12-10T10:17:35+05:30 IST
‘వన్ నేషన్- వన్ రేషన్’ ప్రాజెక్టును అమలు చేయడానికి రాష్ట్రానికి రూ.2,508కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఆహార భద్రత కార్డుల వినియోగదారులు దేశంలో ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలోనైనా రేషన్ సరుకులు

ప్రాజెక్టు అమల్లో దేశంలోనే తెలంగాణ టాప్
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘వన్ నేషన్- వన్ రేషన్’ ప్రాజెక్టును అమలు చేయడానికి రాష్ట్రానికి రూ.2,508కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఆహార భద్రత కార్డుల వినియోగదారులు దేశంలో ఎక్కడున్నా, ఏ రాష్ట్రంలోనైనా రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటును కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టును అమలుచేసే రాష్ట్రాల్లో తెలంగాణ అగ్ర భాగంలో ఉండడం గమనార్హం. అలాగే ఆంధ్రప్రదేశ్కు రూ.2,525 కోట్లు మంజూరయ్యాయి.