నిమ్స్లో యుద్ధ ప్రాతిపదికన
ABN , First Publish Date - 2020-08-01T07:47:00+05:30 IST
నిమ్స్లో యుద్ధ ప్రాతిపదికన
![నిమ్స్లో యుద్ధ ప్రాతిపదికన](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్ సిటీ, జూలై 31(ఆంధ్రజ్యోతి): నిమ్స్లో మొదటి దశ కొవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసే దిశగా వైద్య బృందం ముందుకు సాగుతోంది. కొంత ఆలస్యంగా మొదలైనప్పటికీ ట్రయల్స్ ప్రక్రియ వేగం పుంజుకుంది. ఇదే వేగంతో కొనసాగితే.. మరో వారం రోజుల్లో మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కావచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ నెల 20న తొలుతగా ఇద్దరు వలంటీర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు. దశల వారీగా దానిని ఆరుగురికి పెంచారు. ఇప్పటి వరకు 40 మందికి పైగా వ్యాక్సిన్ ఇచ్చినట్లు సమచారం. వివరాలను ఆస్పత్రి వర్గాలు గోప్యంగా ఉంచుతున్నాయి. ప్రయోగానికి 60మంది వలంటీర్లు ముందుకురాగా.. వారిలో ఆరోగ్యంగా ఉన్నవారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తున్నారు. సోమవారం మరికొందరికి వ్యాక్సిన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఆ వలంటీర్లను ఒక రోజంతా ఐసీసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఆరోగ్యంగా ఉంటేనే మరుసటి రోజు డిశ్చార్జ్ చేస్తున్నారు.