ధరల నియంత్రణపై అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలి: తలసాని
ABN , First Publish Date - 2020-04-01T21:30:53+05:30 IST
ధరల నియంత్రణపై అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆదేశించారు. గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తలసాని టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

హైదరాబాద్: ధరల నియంత్రణపై అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆదేశించారు. గ్రేటర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తలసాని టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని, ప్రజలందరూ లాక్డౌన్ పాటించాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించారు. మార్కెట్కు వెళ్లినప్పుడు దూరం పాటించాలని హితవుపలికారు. వలస కార్మికులందరికీ బియ్యం, నగదు అందేలా చూడాలన్నారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని క్వారంటైన్కు తరలించాలని శ్రీనివాస్యాదవ్ ఆదేశించారు.