డిగ్రీ, పీజీ, ఇంనీరింగ్ విద్యార్థులను ప్రమోట్ చేయాలి: ఎన్ఎస్యూఐ
ABN , First Publish Date - 2020-07-22T09:59:39+05:30 IST
రోజు రోజుకూ కరోనా వ్యాప్తి చెందుతుండడం, ఇప్పటికిప్పుడు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే
![డిగ్రీ, పీజీ, ఇంనీరింగ్ విద్యార్థులను ప్రమోట్ చేయాలి: ఎన్ఎస్యూఐ](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్, జూలై 21(ఆంధ్రజ్యోతి): రోజు రోజుకూ కరోనా వ్యాప్తి చెందుతుండడం, ఇప్పటికిప్పుడు పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశం లేకపోవడం నేపథ్యంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఇతర కోర్సుల విద్యార్థుల ను ప్రమోట్ చేయాలంటూ ప్రభుత్వాన్ని ఎన్ఎ్సయూఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఈ నెల 23 నుంచి 26 వరకూ ఈ మెయుళ్ల ద్వారా జాతీయ మానవ హక్కుల కమిషన్కు విజ్ఞప్తులు పంపాలంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఎన్ఎ్సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ మంగళవారం ఓ ప్రకటనలో కోరారు.