రేపు పాలెంలోని వ్యవసాయ క్షేత్రంలో నోముల అంత్యక్రియలు
ABN , First Publish Date - 2020-12-01T14:14:18+05:30 IST
నల్లగొండ: నకిరేకల్ మండలం పాలెంలోని వ్యవసాయ క్షేత్రంలో రేపు (బుధవారం) ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు జరగనున్నాయి.

నల్లగొండ: నకిరేకల్ మండలం పాలెంలోని వ్యవసాయ క్షేత్రంలో రేపు (బుధవారం) ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం నోముల భౌతికకాయాన్ని నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియా మండల కేంద్రంలోని ఆయన నివాసానికి ఈరోజు సాయంత్రం వరకు తరలించే అవకాశం ఉంది. రేపు నకిరేకల్కు తరలించి ఆయన వ్యవసాయ క్షేత్రమైన పాలెంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.