జొన్నల సేకరణకు నోడల్ ఏజెన్సీగా మార్క్ఫెడ్
ABN , First Publish Date - 2020-04-26T09:14:55+05:30 IST
రబీలో పండిన హైబ్రిడ్ జొన్నల సేకరణకు నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం మార్క్ఫెడ్ను ఏర్పాటు చేసింది...

రబీలో పండిన హైబ్రిడ్ జొన్నల సేకరణకు నోడల్ ఏజెన్సీగా ప్రభుత్వం మార్క్ఫెడ్ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు వ్యవసాయశాఖ కార్యదర్శి డాక్టర్ బి.జనార్దన్ రెడ్డి శనివారం జీవో జారీ చేశారు. కనీస మద్దతు ధరతో జొన్నలు సేకరించేలా ఉత్తర్వు లిచ్చారు. దాంతో పాటు మార్కెట్ ఫీజు నుంచి మినహాయింపు కూడా ఇచ్చారు. రాష్ట్రంలో 2019-20 రబీలో పండిన జొన్నలను మార్క్ఫెడ్ కొనుగోలు చేయనుంది.