కరోనాకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు: తలసాని
ABN , First Publish Date - 2020-07-05T00:10:06+05:30 IST
కరోనాకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. రాబోయే రోజుల్లో కరోనా మరింత పెరిగే అవకాశం ఉందని
హైదరాబాద్: కరోనాకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. రాబోయే రోజుల్లో కరోనా మరింత పెరిగే అవకాశం ఉందని, లక్షణాలు లేకుండానే చాలా మందికి కరోనా వస్తోంది, పోతోందని వెల్లడించారు. లాక్డౌన్ అనేక అంశాలతో ముడిపడి ఉందని, కేంద్రం ఓ వైపు లాక్డౌన్ సడలింపులు ఇస్తోందని, లాక్డౌన్ పెట్టాలా వద్దా అనేది పరిశీలిస్తున్నామని తలసాని చెప్పారు.