47 మంది శాంపిల్స్‌లో 45 మందిలో కరోనా వైరస్‌ లేదు

ABN , First Publish Date - 2020-03-04T21:08:09+05:30 IST

కోరానా వైరస్‌ (కొవిడ్‌-19) కలకలం హైదరాబాద్‌ వాసుల్లో వణుకు పుట్టిస్తోంది. అయితే గాంధీ ఆస్పత్రిలో మంగళవారం 47 మందికి కొవిడ్‌-19 శాంపిల్స్‌ సేకరించగా ఇందులో 45 మందికి వైరస్‌ సోకలేదని తెలంగాణ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది.

47 మంది శాంపిల్స్‌లో 45 మందిలో కరోనా వైరస్‌ లేదు

హైదరాబాద్‌: కోరానా వైరస్‌ (కొవిడ్‌-19) కలకలం హైదరాబాద్‌ వాసుల్లో వణుకు పుట్టిస్తోంది. అయితే గాంధీ ఆస్పత్రిలో మంగళవారం 47 మందికి కొవిడ్‌-19 శాంపిల్స్‌ సేకరించగా ఇందులో 45 మందికి వైరస్‌ సోకలేదని తెలంగాణ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రకటించింది. ఆశాఖ బుధవారం విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. కాగా మరో రెండు నమూనాలను పూణెలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపినట్టు అధికారులు తెలిపారు. గురువారం నాటికి దీనికి సంబంధించిన రిపోర్ట్‌ వస్తుందని తెలిపారు. కొవిడ్‌-19 పాజిటివ్‌ సోకిందన్న అనుమానంతో ఇద్దరిని ఇప్పటికేగాంధీ ఆస్పత్రిలోని ఐసొలేషన్‌ వార్డులో ఉంచారు. ఇప్పటికే ఒక వ్యక్తివిదేశీ ప్రయాణం చేసిన కారణంగా వైరస్‌సోకిందన్నఅనుమానం కాగా, మరో వ్యక్తి  ఇప్పటికే కొవిడ్‌-19 పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నాడు. గాంధీలో 45 మంది నమూనాల్లో నెగిటివ్‌ రిపోర్ట్‌ రావడంతో వారిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్టు అధికారులు తెలిపారు. అయినా వారంతా 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని సూచించారు. ఇప్పటికే వైరస్‌పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి గాంధీ ఆస్పత్రిలో ఐసొటేషన్‌వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 


Updated Date - 2020-03-04T21:08:09+05:30 IST