తెలంగాణలో కొత్తగా 2,216 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-09-13T15:21:42+05:30 IST
తెలంగాణలో కొత్తగా 2,216 కరోనా కేసులు నమోదుకాగా..11 మంది మృతి చెందారు.
![తెలంగాణలో కొత్తగా 2,216 కరోనా కేసులు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020091309500683/09132020095049n83.jpg)
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 2,216 కరోనా కేసులు నమోదుకాగా..11 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 2,603 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 1,57,096కి చేరగా.. చికిత్స నుంచి కోలుకుని 1,24,258 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ఇప్పటివరకు 961 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,607 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 341, రంగారెడ్డిలో 210, మేడ్చల్ 148 కేసులు నమోదయ్యాయి.