నేడు దేశవ్యాప్త సమ్మె
ABN , First Publish Date - 2020-11-26T08:27:33+05:30 IST
బీజేపీకి ఓటు వేస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని మంత్రి హరీశ్రావు అన్నారు. పటాన్చెరు పరిధిలోని బీహెచ్ఈఎల్,

కేంద్రం విధానాలకు వ్యతిరేకంగా నిర్వహణ
25 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారంటున్న కార్మిక యూనియన్లు
బ్యాంకింగ్ సేవలపైనా ప్రభావం.. సమ్మెకు టీఆర్ఎస్ మద్దతు
టీఆర్ఎస్ మద్దతు
బీజేపీకి ఓటు వేస్తే కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని మంత్రి హరీశ్రావు అన్నారు. పటాన్చెరు పరిధిలోని బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్ సంస్థలకు చెందిన ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను కాపాడుకునేందుకు ఐక్య ఉద్యమాలకు సిద్ధమవుతామని తెలిపారు. 26న జరిగే సార్వత్రిక సమ్మెకు టీఆర్ఎస్ మద్దతిస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
కాగా సమ్మెకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని మాజీ ఎంపీ, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ తెలిపారు. బీఎ్సఎన్ఎల్ ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకుంటున్న పార్టీ టీఆర్ఎస్ అని, ఈ అంశాన్ని సీఎం హోదాలో గట్టిగా ప్రస్తావించిందీ కేసీఆర్ ఒక్కరేనన్నారు. కార్మిక యూనియన్ల సమ్మెకు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), టీయూడబ్ల్యూజే, భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం (యూసీసీఆర్ఐ-ఎంఎల్) మద్దతు తెలిపాయి. తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ సంయుక్త కార్యాచరణ కమిటీ కూడా మద్దతు ప్రకటించింది.
సార్వత్రిక సమ్మెకు మద్దతిస్తున్నట్టు తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ తెలిపింది. కాగా తెలంగాణలోని 3,500 గ్రామాల్లో గురువారం బంద్, నిరసన ప్రదర్శనలు నిర్వహించడానికి రైతు, కూలీ, చేతి వృత్తులు, మహిళ, సామాజిక, విద్యార్థి, యువజన, గిరిజన తదితర ప్రజాసంఘాలు కార్యాచరణ రూపొందించాయి. అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ పిలుపుమేరకు ఈ బంద్ నిర్వహిస్తున్నారు.
