దమ్మన్నపేట శ్రీమంతుడు నర్సింహారెడ్డి: కేటీఆర్
ABN , First Publish Date - 2020-03-16T18:35:18+05:30 IST
హైదరాబాద్: వరంగల్ జిల్లా దమ్మనాపేటకు చెందిన కె.నర్సింహ రెడ్డితో మంత్రి కేటీఆర్ నేడు భేటీ అయ్యారు
హైదరాబాద్: వరంగల్ జిల్లా దమ్మనాపేటకు చెందిన కె.నర్సింహ రెడ్డితో మంత్రి కేటీఆర్ నేడు భేటీ అయ్యారు. ఆయనను దమ్మన్నపేట శ్రీమంతుడుగా కేటీఆర్ అభివర్ణించారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నరసింహారెడ్డి తన సొంత గ్రామ అభివృద్ధికి 25 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు.
గ్రామాభివృద్ధికి కృషి చేసేందుకు ముందుకు వచ్చినందుకు నరసింహారెడ్డికి కేటీఆర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. స్వచ్ఛందంగా గ్రామాల అభివృద్ధి కోసం దాతలు ముందుకు రావడం ఎంతో స్ఫూర్తిదాయకమని కేటీఆర్ కొనియాడారు.