మొక్కలు తిన్న మేకలకు జరిమాన
ABN , First Publish Date - 2020-09-18T15:15:32+05:30 IST
మొక్కలు తిన్న కారణంగా మేకలకు జరిమానా విధించిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.

నల్లగొండ: మొక్కలు తిన్న కారణంగా మేకలకు జరిమానా విధించిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. డిండి గ్రామ పంచాయతీ పరిధిలో హరితహారంలో నాటిన మొక్కలను మేకలు తిన్నాయి. దీంతో గ్రామా పంచాయతీ సిబ్బంది మొక్కలు తిన్న మేకలకు జరిమానా విధించారు. అయితే జరిమానాను ఎవరూ చెల్లించకపోవడంతో గ్రామ పంచాయతీ కార్యాలయంపై మేకలను సిబ్బంది బంధించారు.