‘పుల్కల్’ సొసైటీ డైరెక్టర్ పదవికి నాగిరెడ్డి సోదరుడు నామినేషన్
ABN , First Publish Date - 2020-02-08T09:57:07+05:30 IST
సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) సొసైటీ ఎన్నికల్లో రాష్ట్రఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి సోదరుడు వి.అశోక్రెడ్డి పోటీ చేస్తున్నారు. సొసైటీలోని పదో వార్డు డైరెక్టర్

సంగారెడ్డి జిల్లాలోని పుల్కల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) సొసైటీ ఎన్నికల్లో రాష్ట్రఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి సోదరుడు వి.అశోక్రెడ్డి పోటీ చేస్తున్నారు. సొసైటీలోని పదో వార్డు డైరెక్టర్ పదవికి కాంగ్రెస్ మద్దతుతో శుక్రవారం ఆయన నామినేషన్ వేశారు. పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట గ్రామానికి చెందిన నాగిరెడ్డి అన్న యాదగిరిరెడ్డి ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీలో మండలస్థాయి నేతగా కొనసాగుతున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అశోక్రెడ్డి తన పెద్దన్న యాదగిరిరెడ్డితో విభేదించి దామోదర రాజనర్సింహ సమక్షంలో కాంగ్రె్సలో చేరారు. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేస్తున్నారు.