‘మై హోం గ్రూప్’ 5 కోట్ల విరాళం
ABN , First Publish Date - 2020-10-21T09:37:34+05:30 IST
హైదరాబాద్లో వరద బాధితుల సహాయక చర్యల కోసం సీఎంఆర్ఎఫ్కు ‘మై హోం గ్రూప్’ రూ.5 కోట్ల విరాళాన్ని ఇచ్చింది. ముఖ్యమంత్రి..

హైదరాబాద్, అక్టోబరు 20: హైదరాబాద్లో వరద బాధితుల సహాయక చర్యల కోసం సీఎంఆర్ఎఫ్కు ‘మై హోం గ్రూప్’ రూ.5 కోట్ల విరాళాన్ని ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఈ సహాయాన్ని అందించామని మై హోం గ్రూప్ చైర్మన్ డాక్టర్ రామేశ్వర్ రావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ నగర కార్పొరేట్ పౌరుడిగా వరద బాధితులకు సహాయం చేయడం తన బాధ్యత అని ఆయన చెప్పారు.