ముత్తూట్ ఆపన్న హస్తం
ABN , First Publish Date - 2020-04-08T09:20:09+05:30 IST
లాక్డౌన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ ఆపన్న హస్తం అందిస్తూ.. కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలను చేపడుతోంది. మంచిర్యాలలో 200మంది రోజువారీ కూలీలకు ఆహారం...

హైదరాబాద్: లాక్డౌన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ ఆపన్న హస్తం అందిస్తూ.. కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాలను చేపడుతోంది. మంచిర్యాలలో 200మంది రోజువారీ కూలీలకు ఆహారం, నిత్యావసర వస్తువులను సంస్థ అందజేసింది. హన్మకొండ, కాజీపేటలో కూడా పలువురికి ఆహారం, సైబరాబాద్ పోలీసులకు మాస్కులను సమకూర్చింది. వైజాగ్లో నిత్యావసర వస్తువులను అనకాపల్లి ఎంపీ సమక్షంలో అందించారు.