దారుణం...భర్తను చంపిన భార్య

ABN , First Publish Date - 2020-09-06T21:21:16+05:30 IST

దారుణం...భర్తను చంపిన భార్య

దారుణం...భర్తను చంపిన భార్య

హైదరాబాద్ : రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య కత్తితో పొడిచి భర్తను హత్య చేసింది. ఆర్మీలో పదవీ విరమణ పొందిన విశాల్ దివాన్‌ను కుటుంబ కలహాలతో భార్య సబీనా రోషం ఈ దారుణానికి పాల్పడింది.  గత కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో దూరంగా ఉంటున్నారు. ఇటీవల వారిద్దరు మళ్లీ కలిసి జీవనం కొనసాగిస్తున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-09-06T21:21:16+05:30 IST