వారికీ పూర్తి వేతనాలివ్వాలి: గూడూరు

ABN , First Publish Date - 2020-04-05T08:32:41+05:30 IST

రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ శాఖల ఉద్యోగులకూ పూర్తి వేతనాలు చెల్లించాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి ఈ శాఖల...

వారికీ పూర్తి వేతనాలివ్వాలి: గూడూరు

రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ శాఖల ఉద్యోగులకూ పూర్తి వేతనాలు చెల్లించాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి ఈ శాఖల సిబ్బందీ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. మరోవైపు.. కరోనా బాధితులకు సహాయార్థం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కు 4 రోజుల్లో సుమారు 250 కాల్స్‌ వరకూ వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా.. మర్రి శశిధర్‌రెడ్డి నేతృత్వంలో టీపీపీసీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటైంది.

Updated Date - 2020-04-05T08:32:41+05:30 IST