ఎమ్మెల్యే వర్సెస్‌ ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2020-12-30T07:29:05+05:30 IST

వికారాబాద్‌ జిల్లా తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. మునిసిపల్‌ కౌన్సిల్‌ వేదికగా జరిగిన పరిణామాలు ఇద్దరు నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేదాకా వెళ్లాయి.

ఎమ్మెల్యే వర్సెస్‌ ఎమ్మెల్సీ

కేటీఆర్‌ వద్దకు తాండూరు పంచాయితీ

ఫోన్‌లో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫిర్యాదు

నేరుగా వెళ్లి ఫిర్యాదు చేసిన మహేందర్‌రెడ్డి


తాండూరు, డిసెంబరు 29: వికారాబాద్‌ జిల్లా తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. మునిసిపల్‌ కౌన్సిల్‌ వేదికగా జరిగిన పరిణామాలు ఇద్దరు నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేదాకా వెళ్లాయి. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి శబరిమల పర్యటనకు వెళ్తూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌కు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మంగళవారం స్వయంగా వెళ్లి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు.  పట్టణాభివృద్ధికి సంబంధించి ప్రధానమైన మూడు అంశాలను మునిసిపల్‌ కౌన్సిల్‌ ఎజెండాలో  చేరిస్తే వాటిని బలవంతంగా తొలగించారని, నిబంధనలకు విరుద్ధంగా రెండో ఎజెండాను ఆమోదించారని ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, అధికార పార్టీ ఎమ్మెల్యే అయి ఉండి చెత్త ఎజెండా అంటూ దానిని చించాల్సిందిగా ప్రతిపక్షాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్సీ ఆరోపించారు. దీంతో ఈ పరిణామాలు పార్టీకి నష్టం వాటిల్లేలా ఉన్నాయని, దీనిని సీరియ్‌సగా పరిగణించాలని టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నిర్ణయించింది. ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి శబరిమల నుంచి రాగానే ఇరువురిని పిలిచి మాట్లాడే యోచనలో ఉన్నట్లు తెలిసింది. 

Updated Date - 2020-12-30T07:29:05+05:30 IST