క్రీడలతో మానసికోల్లాసం
ABN , First Publish Date - 2020-11-06T06:02:47+05:30 IST
క్రీడలతో స్నేహాభావంతోపాటు మానసికోల్లాసం, శారీరక ధృడత్వం పెరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు
![క్రీడలతో మానసికోల్లాసం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
మొగుళ్లపల్లి, నవంబరు 5: క్రీడలతో స్నేహాభావంతోపాటు మానసికోల్లాసం, శారీరక ధృడత్వం పెరుగుతుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్థానిక యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. గ్రామీణ క్రీడాకారులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం కొర్కిశాల మోడల్ స్కూల్ వద్ద సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ముల్కలపల్లిలో పల్లె ప్రకృతి వనంలో మొక్కను నాటారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ యార సుజాత, జడ్పీటీసీ జోరుక సదయ్య, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నర్సింగారావు, వైస్ ఎంపీపీ రాజేశ్వర్రావు, సర్పంచ్ ధర్మారావు, ఎంపీటీసీ ఎర్రబెల్లి వనిత, వివిధ గ్రామాల సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు.