బీడీఎల్లో పేలిన క్షిపణి?
ABN , First Publish Date - 2020-11-27T08:12:02+05:30 IST
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూర్ పరిధిలోని భారత్ డైనమిక్స్ (బీడీఎల్)లో ఓ ఆయుధం పొరపాటున

కకావికలమైన వ్యవసాయ కూలీలు
క్షిపణి అయ్యి ఉంటుందని అనుమానాలు
పటాన్చెరు రూరల్, నవంబరు 26: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూర్ పరిధిలోని భారత్ డైనమిక్స్ (బీడీఎల్)లో ఓ ఆయుధం పొరపాటున పేలింది. అది క్షిపణి కావొచ్చని స్థానికులు భావిస్తున్నారు. స్థానిక పొలాల్లో పనిచేసే రైతు కూలీల కథనం ప్రకారం.. బీడీఎల్ వద్ద గురువారం ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. మందుగుండు గోళం గాల్లో మండుతూ.. సమీపంలోని పొలాల్లో పడింది. ఆ శబ్దానికి అక్కడ పనిచేస్తున్న కూలీలు చెల్లాచెదురైపోయారు.
‘‘ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. ఆకాశంలోంచి దూసుకుపోయింది. ఆ శబ్దానికి దద్దరిల్లిపోయాం. తర్వాత కొద్దిసేపటికి బీడీఎల్ భద్రతాసిబ్బంది తనిఖీలు జరిపారు. పొలాల్లో ఏమైనా మందుగుండు ఆనవాళ్లు ఉన్నాయా? అని పరిశీలించారు’’ అని ఘటన జరిగిన సమయంలో బీడీఎల్ సమీపంలోని పత్తి చేనులో పనిచేస్తున్న వ్యవసాయ కూలీ మంగ తెలిపారు.
కాగా.. ఈ ఘటనపై బీడీఎల్ వర్గాల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.