కరోనాతో మిర్యాలగూడ రైస్ మిల్స్ లాక్ డౌన్: రమేష్
ABN , First Publish Date - 2020-07-20T01:26:48+05:30 IST
కరోనాతో మిర్యాలగూడ రైస్ మిల్స్ లాక్ డౌన్: రమేష్

నల్గొండ: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కేసుల విజృంభణతో ఈ నెల 21 నుంచి 31 వరకు మిర్యాలగూడ రైస్ మిల్లర్లను లాక్ డౌన్ చేస్తున్నట్లు అధ్యక్షుడు కర్నాటి రమేష్ పేర్కొన్నారు.