‘అమీన్పూర్’లో మరో అకృత్యం?
ABN , First Publish Date - 2020-08-16T10:23:21+05:30 IST
తీగ లాగుతున్న కొద్దీ అమీన్పూర్ మారుతి అనాథాశ్రమం డొంక కదులుతోంది. 14 ఏళ్ల బాలికపై జరిగినట్లే మరో బాలికపైనా అకృత్యం జరిగినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. తొలి కేసులో..

- ఆశ్రమం సీజ్.. స్టేట్హోమ్కి బాలికల తరలింపు
హైదరాబాద్సిటీ, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): తీగ లాగుతున్న కొద్దీ అమీన్పూర్ మారుతి అనాథాశ్రమం డొంక కదులుతోంది. 14 ఏళ్ల బాలికపై జరిగినట్లే మరో బాలికపైనా అకృత్యం జరిగినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. తొలి కేసులో ఇప్పటికే పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు. బాలికల వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఆశ్రమాన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు 49 మంది బాలికలను ఇతర హోమ్లకు తరలించారు. వీరందరికీ కరోనా పరీక్షల్లో నెగెటివ్ వచ్చిందని అధికారులు చెప్పారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆశ్రమాన్ని రెవెన్యూ అధికారులు శనివారం సీజ్ చేశారు.