కలుపు తీసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
ABN , First Publish Date - 2020-06-25T23:53:01+05:30 IST
రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ చేలో కలుపు తీశారు. గురువారం ఈ సన్నివేశం చోటుచేసుకుంది.

మహబూబ్నగర్ : రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ చేలో కలుపు తీశారు. గురువారం ఈ సన్నివేశం చోటుచేసుకుంది.
మహబూబ్నగర్ పట్టణంలోని ఏనుగొండ వద్ద జొన్న చేనులో దంతె కొడుతున్న రైతులను గమనించిన శ్రీనివాస్ గౌడ్... నూతన పరికరాలతో జొన్న చేనుల్లో కలుపును తొలగించేందుకు ఉపయోగించే యంత్రంతో రైతులతో కలిసి కలుపు తీశారు. పార్లమెంట్ సభ్యుడు మన్నే శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.