ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ పర్యటన
ABN , First Publish Date - 2020-03-04T17:24:50+05:30 IST
ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ పర్యటన
![ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ పర్యటన](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
సత్తుపల్లి: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఉదయం ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి పట్టణంలో పలు వార్డులను, కూరగాయలను మార్కెట్ను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ పరికరాలు, గ్లౌజ్లు, బూట్లు అందించాలని కమిషనర్కు ఆదేశించారు. ప్లాస్టిక్ను వాడకుండా జూఠ్ బ్యాగ్లను వాడేలా చూడాలని అధికారులను మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాలు జారీ చేశారు.