కేంద్రం బ్లాక్ మెయిల్ చేసింది.. మంత్రి ఫైర్
ABN , First Publish Date - 2020-12-06T23:16:34+05:30 IST
కేంద్ర చట్టాలు రైతులను వ్యవసాయం చేయలేని పరిస్థితికి తెచ్చాయని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కొత్త చట్టాల్లో రైతు కోణం లేదని, వ్యాపార కోణం ఉందని ..

హైదరాబాద్: కేంద్ర చట్టాలు రైతులను వ్యవసాయం చేయలేని పరిస్థితికి తెచ్చాయని మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. కొత్త చట్టాల్లో రైతు కోణం లేదని, వ్యాపార కోణం ఉందని ఆయన ఆరోపించారు. కేంద్రం కనీస మద్దతు ధర లేకుండా చేసిందని చెప్పారు. వరికి 1888కి మించి మద్దతు ధర ఇస్తే కొనుగోళ్లు ఆపేస్తామని కేంద్రం బ్లాక్ మెయిల్ చేసిందన్నారు. కౌలుదారుల నుంచి పత్తి కొనుగోలు చేయమని సీసీఐ ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తు చేశారు. కేంద్రానికి రైతులకంటే కుబేరుల ప్రయోజనమే ప్రధానంగా మారిందని నిరంజన్ రెడ్డి తెలిపారు.