మరిన్ని నగరాలకు ఐటీ పరిశ్రమల విస్తరణ- కేటీఆర్
ABN , First Publish Date - 2020-12-05T22:29:24+05:30 IST
రాష్ట్రంలోని మరిన్ని నగరాలకు ఐటీ పరిశ్రమలను విస్తరించనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు.

హైదరాబాద్: రాష్ట్రంలోని మరిన్ని నగరాలకు ఐటీ పరిశ్రమలను విస్తరించనున్నట్టు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. శనివారం ప్రగతి భవన్లో రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్, ఖమ్మం, వరంగల్ నగరాలకు ఐటీ పరిశ్రమల విస్తరణకు ముమ్మర ఏర్పాట్టుచేసినట్టు తెలిపారు. కాగా వరంగల్ నగరంలో ఇప్పటికే పలు ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయని అన్నారు.
మరికొన్ని ప్రముఖ కంపనీలు త్వరలోనే వరంగల్ నగరానికి రానున్నాయని తెలిపారు. దీని పై వారిలో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు. ఉప్పల్, నాచారం ఇండస్ర్టియల్ ఏరియాలో ఐటీ పార్క్ల నిర్మాణం పై ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ పార్క్ల నిర్మాణానికి సహకారం అందించాలని సీఎస్ సోమేశ్కుమార్కు మంత్రి ఫోన్చేసి కోరారు. కొంపల్లిలో ఐటీపార్క్ నిర్మాణానికి భూసేకరణ చేయాలని టీఎస్ఐఐసీకి ఆదేశాలు జారీ చేశారు.