కేటీఆర్ పిలుపు.. మంత్రి మల్లారెడ్డి విరాళం..
ABN , First Publish Date - 2020-07-27T21:54:45+05:30 IST
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు మంత్రి మల్లారెడ్డి స్పందించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజల శ్రేయస్సు కోసం భారీ విరాళం

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు మంత్రి మల్లారెడ్డి స్పందించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న వేళ ప్రజల శ్రేయస్సు కోసం భారీ విరాళం ప్రకటించారు. ఆరు కరోనా టెస్టింగ్ అంబులెన్సులను ప్రభుత్వానికి సమకూర్చేందుకు అవసరమైన నగదుకు సంబంధించిన చెక్కును మంత్రి కేటీఆర్కు మల్లారెడ్డి అందజేశారు.
ఇదిలాఉండగా, చెరువుల సుందరీకరణ, శుద్ధీకరణ, ఎకో టూరిజం పార్కుల ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేయాలని మంత్రి కేటీఆర్ను మల్లారెడ్డి కోరారు. నూతనంగా ఏర్పడిన జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్కు గతంలో టీయూఎఫ్ఐడీసీ నుండి మంజూరు చేసిన రూ.25.82 కోట్ల అభివృద్ధి నిధులను ప్రాధాన్యతా కమ్రంలో విడుదల చేయాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. నిధులు విడుదల చేయాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.