దేశంలో ఐటిఐలు గొప్ప అభ్యాస కేంద్రాలు:కిషన్ రెడ్డి

ABN , First Publish Date - 2020-10-03T21:38:25+05:30 IST

దేశంలో ఐటిఐలు గొప్ప అభ్యాస కేంద్రాలుగా ఉపాధి అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తున్నాయని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

దేశంలో ఐటిఐలు గొప్ప అభ్యాస కేంద్రాలు:కిషన్ రెడ్డి

హైదరాబాద్: దేశంలో ఐటిఐలు గొప్ప అభ్యాస కేంద్రాలుగా ఉపాధి అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను అందిస్తున్నాయని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి  కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్ లోని మల్లేపల్లి మోడల్ ఐటీఐ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నరు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఐటిఐలను బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. మల్లేపల్లి ఐటిఐ మోడల్ ఐటిఐ గా అభివృద్ది చేసేందుకు రూ.10 కోట్ల నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అభివృద్ధి చేసినట్లు, మోడల్‌ ఐటీఐల కోసం కేంద్రం రూ.300 కోట్లు కేటాయించిందని కిషన్‌ రెడ్డి తెలిపారు.


దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఐటీఐలను గుర్తించి మోడల్‌ ఐటీఐలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. మారుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులతో దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలో మోడల్‌ ఐఐటీలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్రం మంత్రి వివరించారు. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా, రానున్న రోజుల్లో విధ్యార్థులకు, యువతకు వొకేషనల్ కోర్సులలో శిక్షణ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని కిషన్ రెడ్డి తెలిపారు.  


ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి  మహమూద్‌ అలీ, మంత్రులు మల్లారెడ్డి,తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నాంపల్లి  ఎమ్మెల్యే జాఫర్‌ మెరాజ్‌హుస్సేన్‌, కార్మిక ఉపాధి కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణికుముదిని, కేంద్ర మంత్రి అదనపు కార్యదర్శి  శశికిరణాచారీ, ఉపాధి శిక్షణ శాఖ సంచాలకులు కె.వై.నాయక్‌, జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌వీకే నగేశ్‌, తదితరులు పాల్గొన్నారు.రా

Updated Date - 2020-10-03T21:38:25+05:30 IST