రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తెచ్చే ప్రయత్నం: హరీష్
ABN , First Publish Date - 2020-05-18T16:17:34+05:30 IST
రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తెచ్చే ప్రయత్నం: హరీష్
![రాష్ట్రాలపై కేంద్రం ఒత్తిడి తెచ్చే ప్రయత్నం: హరీష్](https://media.andhrajyothy.com/appimg/galleries/2020051810450940/05182020104658n21.gif)
సంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి హరీష్రావు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కనీస సహాయం చేయడం లేదని విమర్శించారు. షరతులతో కూడిన అప్పులు తీసుకోమంటోందన్నారు. కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందనిన మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఉదయం జిల్లాలో పర్యటించిన ఆయన జానపద కళాకారులకు నిత్యావసర సరుకులను అందజేశారు.