కేంద్రంపై ఫైర్ అయిన హరీష్ రావు

ABN , First Publish Date - 2020-05-18T21:03:17+05:30 IST

కేంద్రం తీరుపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కష్ట కాలంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం దారుణం అన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన..

కేంద్రంపై ఫైర్ అయిన హరీష్ రావు

సంగారెడ్డి: కేంద్రం తీరుపై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కష్ట కాలంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం దారుణం అన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. కష్ట కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు 12 కిలోల బియ్యం, 15 వందల నగదు పంపిణీ చేశామని మంత్రి చెప్పుకొచ్చారు. ఇందుకోసం రూ.2500 కోట్లను రెండు విడతలుగా పేదల అకౌంట్లలో వేశామని చెప్పారు. కేంద్రం మాత్రం ఐదు కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. అప్పులు తీసుకునేందుకు కేంద్రం షరతులు విధించిందని ఫైర్ అయ్యారు. కష్టకాలంలో ఇలా షరతులు విధించడమేంటని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు.

Updated Date - 2020-05-18T21:03:17+05:30 IST