బీసీ సంక్షేమ శాఖ పధకాలపై మంత్రి గంగుల సమీక్ష
ABN , First Publish Date - 2020-06-23T00:55:39+05:30 IST
బీసీ సంక్షేమశాఖ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ సోమవారం తన కార్యాలయంలో బిసి సంక్షేమశాఖలో జరుగుతున్న వివిధ పథకాలపై ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్:బీసీ సంక్షేమశాఖ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ సోమవారం తన కార్యాలయంలో బిసి సంక్షేమశాఖలో జరుగుతున్న వివిధ పథకాలపై ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రాబోయే 2020-21 విద్యా సంవత్సరానికి మహాత్మాజ్యోతిబా పూలేహాస్టల్ విద్యార్ధులకు, బీసీ హాస్టల్లో ఉన్న విద్యార్ధులకు అవసరమైన సౌకర్యాలు, మెరుగైన వసతుల కల్పనపై చర్చించారు. బీసీ కార్పొరేషన్, ఎంబిసి కార్పొరేషన్, వివిధ ఫెడరేషన్లకు గతంలో ప్రభుత్వం కేటయించిన బడ్జెట్ వివరాలు, ప్రస్తుతం అమలులో ఉన్న వివిధ పథకాలు, భవిష్యత్తులో చేపట్టబోయే పథకాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. గతంలో బీసీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మామీలను పూర్తిస్తాయిలో అమలుచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి వి. సైదా, బీసీ కార్పొరేషన్ ఎండి అలోక్కుమార్, జ్యోతిబాపూలె కార్యదర్శి మల్లయ్యభట్టు, రజక ఫెడరేషన్ఎండి చంద్రశేఖర్, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ ఎండి ఉద య్ ప్రకాశ్, వడ్డెర ఫెడరేషన్ ఎండి బాలాచారి ఇతర అధికారులు పాల్గొన్నారు.