మంత్రి మల్లారెడ్డిని అడ్డుకున్న రైతులు
ABN , First Publish Date - 2020-10-08T08:48:56+05:30 IST
అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మేడ్చల్ జిల్లా ఎంసీపల్లి మండలంలోని లక్ష్మాపూర్తండాకు బుధవారం వచ్చిన మంత్రి చామకూర

శామీర్పేట రూరల్, అక్టోబరు 7: అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మేడ్చల్ జిల్లా ఎంసీపల్లి మండలంలోని లక్ష్మాపూర్తండాకు బుధవారం వచ్చిన రైతులు అడ్డుకున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఎప్పుడిస్తారని రైతులు, కాంగ్రెస్ నాయకులు మంత్రిని నిలదీశారు. లక్ష్మాపూర్ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేశామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారని, ఇక్కడ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని తెలిపారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన మంత్రి.. లక్ష్మాపూర్ వాళ్లంతా దొంగలే అన్నారని రైతులు ఆరోపించారు.