‘కరోనా’ చికిత్సకు ఆస్పత్రులిస్తాం: అసద్‌

ABN , First Publish Date - 2020-04-08T08:44:15+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్య సేవల కోసం దక్కన్‌ మెడికల్‌ కాలేజీ, ఆస్రా, ఒవైసీ ఆసుపత్రులను వాడుకోవాలని మంత్రి కేటీఆర్‌కు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ...

‘కరోనా’ చికిత్సకు ఆస్పత్రులిస్తాం: అసద్‌

కరోనా వ్యాప్తి నేపథ్యంలో వైద్య సేవల కోసం దక్కన్‌ మెడికల్‌ కాలేజీ, ఆస్రా, ఒవైసీ ఆసుపత్రులను వాడుకోవాలని మంత్రి కేటీఆర్‌కు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ సూచించారు. మంగళవారం తాను కేటీఆర్‌, ఇతర అధికారులతో సమావేశమై హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించానని అసద్‌ ట్విటర్‌లో తెలిపారు. కరోనా బారిన పడిన వారికి అందుతున్న చికిత్స, వివిధ శాఖల ఉద్యోగస్థులు అందిస్తున్న సేవల గురించి చర్చించామన్నారు. 


Updated Date - 2020-04-08T08:44:15+05:30 IST