కొత్త రెవెన్యూచట్టంపై నేడు వీఆర్ఓల సమావేశం
ABN , First Publish Date - 2020-09-06T10:24:38+05:30 IST
కొత్త రెవెన్యూచట్టంపై నేడు వీఆర్ఓల సమావేశం
హైదరాబాద్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): కొత్త రెవెన్యూ చట్టం రూపొందుతున్న నేపథ్యంలో ఆదివారం ఉదయం 10 గంటలకు తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించనుంది. కొత్త చట్టంపై సీఎంకు తమ తరఫున కొన్ని వినతులు అందించడానికే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు గోల్కొండ సతీశ్, ప్రధాన కార్యదర్శి కాందారి భిక్షపతి ఓ ప్రకటనలో తెలిపారు.