మెదక్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం..ఏడుగురు మృతి
ABN , First Publish Date - 2020-03-16T23:10:42+05:30 IST
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం..ఏడుగురు మృతి
మెదక్: జిల్లాలోని కొల్చారం మండలం సంగాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, డీసీఎం వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా సంగారెడ్డి జిల్లా ఫసల్వాడి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మెదక్లోని ఏడుపాయల జాతరకు వీరంతా డీసీఎం వ్యాన్లో వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.