హైదరాబాద్: వలస కూలీల దీనావస్థపై స్పందించిన మేయర్
ABN , First Publish Date - 2020-05-18T18:36:58+05:30 IST
హైదరాబాద్: వలస కూలీల దీనావస్థపై స్పందించిన మేయర్

హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా తమ తమ స్వరాష్ట్రాలకు ఎలా వెళ్లాలో దిక్కుతోచక దయనీయ స్థితిలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ముందు దీనంగా కూర్చున్న యూపీ, బీహార్ వలస కూలీలకు మేయర్ బొంతు రామ్మోహన్ చేయూతనందించారు. రైల్వేస్టేషన్ వద్ద వీరిని గమనించిన మేయర్కు వలసకూలీలు తమ బాధను చెప్పుకున్నారు. దీంతో వెంటనే స్పందించిన మేయర్ బొంతు రామ్మోహన్...వలస కూలీలకు వెంటనే ఆన్లైన్లో పాస్ బుక్ చేసి సొంతూళ్లకు పంపించాలని ట్రాఫిక్ సీఐ నాగేశ్వర్ను ఆదేశించారు. తమ దీనావస్థపై మేయర్ స్పందించి... సొంతూళ్లకు వెళ్లేలా ఏర్పాట్లు చేయడం పట్ల వలస కూలీలు ఆనందం వ్యక్తం చేశారు.